గుర్తులు తారుమారు.. ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్
గుర్తులు తారుమారు.. ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్
GHMC ఎన్నికలు మందకొడిగా సాగుతున్న వేళ, ఓల్డ్ మలక్పేట డివిజన్లలోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్పై ముద్రితమైంది. దీంతో అక్కడ పోలింగ్ను రద్దు చేశారు. అక్కడ 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ను కూడా నిషేధించినట్లు ఎస్ఈసీ పార్థసారధి చెప్పారు.

కామెంట్లు లేవు